3, అక్టోబర్ 2011, సోమవారం

ఓ సామాన్యుడిని

ఎవరికి...ఏమని చెప్పాలో తెలియడంలేదు...

గడిచిన రెండేళ్ళలో జరిగిన అభివ్రుద్ధి తలచుకుంటే గుండె భారమౌతోంది...మనలో మానవతా విలువలు ఇంతగా దిగజారిపోయాయా!?!!

ప్రత్యేక తెలంగాణా కావచ్చు,సమైఖ్యాంధ్ర కావచ్చు...లేక ఇంకోటి కావచ్చు....దయచేసి ఉధ్యమాల పేరిట ప్రజల్ని బలి కానివ్వకండి.

ఉధ్యమాలు ఎలా చేయాలో ఈ కాలంలో కూడా ఓ కురువ్రుద్ధుడు (అన్నా హజారే) చేసి చూపించారు.ఆ ఉధ్యమనికి దేశం మొత్తం మద్దతు పలికింది.కానీ, ఎక్కడా ఒక చిన్న అద్దం కూడా పగలలేదు.ఘర్షణలు జరగలేదు.

మరి మన ఉధ్యమాలు ఎలా ఉన్నాయి???
ఎటు చూసినా ఏమున్నది నా రాష్ట్రంలో...మూతబడిన సేవలు,విధ్వంసాలు తప్ప...

అత్యవసర పరిస్థితిలో నగరానికి తీసుకెల్దామంటే అడుగడుగునా బంధ్ లు,ధర్నాలు...ఇంక పండుగల సంగతి సరే సరి...
సొంత వూళ్ళోని బంధువులను కలువలేని పరిస్థితి.

ఈ రోజు టివిలో చూసిన ఓ వార్త నా గుండెను కలచి వేసింది.

ఒక ఊరు నుంచి నగరానికి చేరుకున్న బస్సుపైకి రాళ్ళు రువ్వారు.బస్సుల అద్దాలు పగిలాయి.ఓ చిన్నారికి గాయాలయ్యాయి.పిల్లలు,స్త్రీలు,అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు.పాపం వాళ్ళేం చేశారు??ఎవరు హర్షిస్తారని ఈ ఉధ్యమం???

నేను ఓ రాష్ట్రం లో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాను.ఇక్కడ ప్రాంతాలకతీతంగా తెలుగు వారమంతా అన్నోన్యంగా ఉంటాం.కలిసే భొoచేస్తాం.సమస్యల గురించీ మాట్లాడు కుంటాం.

హైదరాబాదు చరిత్రని,తిరుపతి వేంకటేశుని,బెజవాడ ధుర్గమ్మనీ చూడకుండా ఉండలేం...

రాష్ట్రం ముక్కలైనా సరే, కలిసి ఉన్నా సరే...మాకు కావలసింది అందరి ఆత్మీయతలే...పోరు బాటలో వాటికి దూరం కాకండి.
శంతియుతంగా సాధించుకోండి. మీ మనుగడ కోసం సమాన్యుల్ని బలి కానియకండి.

ఇట్లు,
ఓ సామాన్యుడిని....